YouTube journalists: యూ ట్యూబ్ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ రెడ్డిపైన, కుటుంబ సభ్యులపైన అభ్యంతరకర విమర్శలతో వీడియోలు పోస్టు చేసిన అభియోగాలపై అరెెస్టయిన యూ ట్యూబ్ మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

YouTube journalists: యూ ట్యూబ్ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

YouTube journalists: : సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ రెడ్డిపైన, కుటుంబ సభ్యులపైన అభ్యంతరకర విమర్శలతో వీడియోలు పోస్టు చేసిన అభియోగాలపై అరెెస్టయిన యూ ట్యూబ్ మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల పూచి కత్తితో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారాలు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో బాధిత జర్నలిస్టులకు కోర్టు ద్వారా భారీ ఉపశమనం దక్కింది. కోర్టు ఆర్డ‌ర్ కాపీలు అందిన వెంట‌నే.. చంచ‌ల్‌గూడ జైలు నుంచి వారు విడుద‌ల కానున్నారు.

అభ్యంతరక వీడియోల పోస్టు కేసులో బుధవారం పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ. రేవతి, న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌లను అరెస్టు చేశారు. ఈ కేసులో రేవతి, సంధ్యలను ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సైబర్​ క్రైమ్​ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్​ వేశారు. కేసులో శనివారం ఇరు వర్గాల మధ్య కోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు కేసులో బెయిల్​ మంజూరు చేయాలని​ జర్నలిస్టులు పిటిషన్​ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో బెయిల్​ ఇవ్వద్దని పబ్లిక్​ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్ లో సీఎంను తిడుతున్న వీడియో వైరల్ గా మారడంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ పోలీసులకు దీనిపై పిర్యాదు చేశారు. పల్స్ టీవీకి చెందిన ఓ రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడిన వ్యక్తి సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించిందని, పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను ‘నిప్పుకోడి’ అనే ఎక్స్ హ్యండిల్లో ట్రోల్ చేసినట్లు గతంలో పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు చేసి ఆ టీవీ ఛానల్ సీఈవో, జర్నలిస్ట్ రేవతితో పాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడం విశేషం.