BJP 11 దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు.. సంస్థాగత ప్రధాన కారదర్శుల భేటీలో నడ్డా గెలుపు వ్యూహాలపై నడ్డా నిర్ధేశం విధాత: దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతంతో పాటు త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉద్బోధించారు. తెలంగాణ సహా 11 దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఆయా రాష్ట్రాల పార్టీ బిజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో […]
BJP
విధాత: దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతంతో పాటు త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉద్బోధించారు. తెలంగాణ సహా 11 దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఆయా రాష్ట్రాల పార్టీ బిజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో ఆదివారం హైద్రాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు.
గెలుపు వ్యూహాలలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధినీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని నడ్డా ఆదేశించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై చర్చించారు.
దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఎజెండాను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరు పై ఈ సందర్భంగా నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించిన నడ్డా ఆయా రాష్ట్రాల అధ్యక్షులకు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులకు పార్టీ బలోపేతం దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్ధేశం చేశారు.