Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, నస్పూర్, దండేపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు పెద్ద సంఖ్యలో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కు తరలివెళ్లారు. గాంధీ భవన్ లో తెలంగాణ […]
Mancherial |
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, నస్పూర్, దండేపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు పెద్ద సంఖ్యలో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కు తరలివెళ్లారు.
గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు, అతని కొడుకు విజిత్ రావు ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి బీఆరెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో హాజీపూర్ జడ్పీటీసీ పుస్కురి శిల్ప, హాజీపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వరరావు, హాజీపూర్ మాజీ ఎంపీటీసీ బొడ్డు శైలజ శంకర్, హాజీపూర్ టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య, వేంపల్లి మాజీ సర్పంచ్ గోనె సంజయ్, సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు నాయకులు సిరిపురం శ్రీనివాస్, ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు మాధవరపు జితేందర్ రావు, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్. బీఆర్ఎస్ తాజా మాజీ పట్టణ అధ్యక్షుడు సాగే సుమోహన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ మురళీధర్, సంగతి మురళి, చిలువేరు నాగేశ్వరరావు తో పాటు దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.