KCR | ఎమ్మెల్యే సంజయ్‌ను పరామర్శించిన కేసీఆర్‌

  • Publish Date - April 10, 2024 / 05:40 PM IST

విధాత, హైదరాబాద్‌: తండ్రిని కోల్పోయిన జ‌గిత్యాల బీఆరెస్‌ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్‌ను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సంజ‌య్ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఎమ్మెల్యే సంజయ్‌ తండ్రి, ప్రముఖ న్యాయ‌వాది హ‌నుమంత‌రావు(85) ఇటీవ‌లే అనారోగ్యంతో మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప‌లువురు పార్టీ నాయ‌కులు ఉన్నారు.

Latest News