Chandrababu విధాత: వలంటీర్లు ద్రోహులు, ఒంటరి మహిళలు, వితంతువులు, యువతుల సమాచారాన్ని ఈ వాలంటీర్లు బయటివారికి చెబుతూ మానవ అక్రమ రవాణాకు కారణం అవుతున్నారు. అందుకే రాష్ట్రంలో వేలమంది మహిళలు అదృశ్యం అయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన్ను ఇరుకునపెట్టాయి. ఈ మేరకు పవన్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం మీద కోర్టులో కేసు పెట్టింది. వలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని […]
Chandrababu
విధాత: వలంటీర్లు ద్రోహులు, ఒంటరి మహిళలు, వితంతువులు, యువతుల సమాచారాన్ని ఈ వాలంటీర్లు బయటివారికి చెబుతూ మానవ అక్రమ రవాణాకు కారణం అవుతున్నారు. అందుకే రాష్ట్రంలో వేలమంది మహిళలు అదృశ్యం అయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన్ను ఇరుకునపెట్టాయి.
ఈ మేరకు పవన్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం మీద కోర్టులో కేసు పెట్టింది. వలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ అనైతిక పనులకు ఆ సమాచారాన్ని వాడుతున్నారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనానికి కారణమయ్యాయి.
తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారిపై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు…రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే…
— N Chandrababu Naidu (@ncbn) July 21, 2023
పవన్ వలంటీర్ల వ్యవస్థ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇక కోర్టుకు వెళ్ళి మరీ పవన్ మీద పరువు నష్టం దావా కేసులో ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టిని. దీనిమీద సీఎం జగన్ కూడా నిన్న గట్టిగానే ఎదురుదాడి చేశారు. అయితే ఈ విషయంలో పవన్కు చంద్రబాబు బాసటగా నిలిచారు.
పవన్ విషయంలో పరువు నష్టం కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడికి పోతోంది అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా డేటా చేరీ చేస్తున్న ప్రభుత్వం మీదనే ఎదురు కేసు పెట్టాలని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ సైతం ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు.
ఇదిలాఉండగా జనసేన మిత్రపక్షం బిజెపి నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పందన కానీ మద్దతు కానీ రాలేదు. పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఎదురైతే తాము అండగా నిలుస్తామని చంద్ర బాబు ఒక మెసేజ్ పంపినట్లు అయింది. మున్ముందు ఈ పార్టీల మధ్య పొత్తు ఉంటుందో లేదో, ఏ స్థాయిలో ఉంటుందో కానీ ప్రస్తుతానికి మాత్రం ఒకే మాట.. ఒకే బాటలో నడుస్తున్నారు.