విధాత: తెలంగాణలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ (BRS party) అభ్యర్థులను సీఎం కేసీఆర్ (CM KCR0 మంగళవారం ప్రకటించారు. కురుమయ్య గారి నవీన్ కుమార్ ( Naveen Kumar) అభ్యర్థిత్వాన్ని రెన్యువల్ చేశారు. కొత్తగా కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ (Deshapati Srinivas)ను, చల్లా వెంకట్రామిరెడ్డి (Challa Venkatrami Reddy)లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ […]
విధాత: తెలంగాణలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ (BRS party) అభ్యర్థులను సీఎం కేసీఆర్ (CM KCR0 మంగళవారం ప్రకటించారు. కురుమయ్య గారి నవీన్ కుమార్ ( Naveen Kumar) అభ్యర్థిత్వాన్ని రెన్యువల్ చేశారు. కొత్తగా కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ (Deshapati Srinivas)ను, చల్లా వెంకట్రామిరెడ్డి (Challa Venkatrami Reddy)లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.