Dharni, Bhumi Sunil ‘ధరణి’ సవరణో, రద్దు చేయడమో సమస్యకు సంపూర్ణ పరిష్కారం కాదు భూచట్టాల నిపుణుడు, న్యాయవాది భూమి సునీల్ ప్రత్యేక చర్చా పత్రం: పార్ట్ -2 ధరణితోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ధరణిని రద్దు చేయడంపైనేనని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయిలో ధరణి సమస్యలు ఉన్నాయని రైతుల గోస చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ధరణిని రద్దు చేయాలా? లేక […]
Dharni, Bhumi Sunil
ధరణితోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ధరణిని రద్దు చేయడంపైనేనని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయిలో ధరణి సమస్యలు ఉన్నాయని రైతుల గోస చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ధరణిని రద్దు చేయాలా? లేక దాంట్లో సవరణలు తేవాలా? అసలు ధరణి సర్వరోగ నివారిణి అవుతుందా? ప్రత్యామ్నాయమేంటి? ఉన్న సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఈ అంశాలపై ప్రముఖ భూచట్టాల నిపుణుడు న్యాయవాది రూపొందించిన అధ్యయనం పత్రం ఇది. దీనిపై మీరూ చర్చించండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. మీ వాదనకు మా విధాత వేదికవుతుంది. మీ వాదనను ప్రపంచానికి చాటుతుంది. – విధాత
ఎడారి లాంటి భూమిని పూర్తి హక్కులతో ఒక రైతుకు ఇస్తే ఆ భూమిని కొన్నేళ్లలో బంగారం పండే భూమిగా మారుస్తాడు. అదే బంగారం పండే భూమిని ఎలాంటి హక్కులు లేకుండా అప్పగిస్తే కొన్నేళ్లలో ఆ భూమి ఎడారి భూమిగా మారుతుంది అని ఒక ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొన్నాడు. సాగుచేసుకోవడానికి భూమి ఉంటేనే సరిపోదు. ఆ భూమి ఏ హక్కుల చిక్కుల్లో లేకుండా ఉంటేనే సాగు సాఫీగా సాగుతుంది. స్వానుభవంలో భూమి, ఆ భూమికి హక్కుదారు ఎవరో తెలిపే పత్రాలు, భూమి రికార్డుల్లో సరైన వివరాలు నమోదు అయ్యి ఉంటేనే ఆ భూమిపై హక్కుకి భద్రత. ఆ భూమి నుంచి పూర్తి లబ్ధి పొందగలిగే అవకాశం. ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో సమస్యల పరిష్కారానికి కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని భూమి సమస్యలు తీరాయి. మరికొన్ని కొత్త భూమి సమస్యలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ రాకముందు ఊరికో వంద సమస్యలు ఉంటే ఇప్పుడు ఊరికో రెండొందల సమస్యలు ఉన్నాయని అంచనా.
ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన భూమి సమస్యలు
DHARANI: ‘ధరణి’పై తహసీల్దార్, ఆర్డీవోలకూ అధికారాలు? వికేంద్రీకరణ దిశగా యత్నాలు!
తక్షణ కర్తవ్యం
ప్రతి భూ యజమాని కోరుకునేది తన భూమి హద్దులకు స్పష్టత, ఆ భూమిపై హక్కులకు పూర్తి భద్రత; సమస్య వస్తే సత్వరం పరిష్కరించే వ్యవస్థ. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎనభయ్యవ దశకం నుండి ప్రయత్నం చేస్తున్నది. వచ్చే ఏడాది నాటికి ఈ లక్ష్యం నెరవేర్చాలంటున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, భూములకు ఒకే రికార్డు, దస్తావేజుల రిజిస్ట్రేషన్ కాకుండా హక్కుల రిజిస్ట్రేషన్ చేసే విధానం, భూహక్కులకు ప్రభుత్వమే హామీ, భూహక్కులకు ఇన్సురెన్స్, ఎక్కడి నుండైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు, వివాద పరిష్కారాలకు ట్రిబ్యునళ్ల ఏర్పాటు కేంద్రం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా (Digital India) భూరికార్డుల ఆధునీకరణ పథక లక్ష్యాలు. కానీ అమలు రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది. భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం.
ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక ఆర్థిక సమన్యాయం సాధించడానికి, అందరూ అభివృద్ధిలో సమభాగం కావడానికి భూమే కీలకం. భూమి సంబంధిత అంశాలపై దృష్టిపెట్టడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే భూమి ఎజెండా అమలు కీలకం. భూ చట్టాల అమలు, భూ పరిపాలన మెరుగు తప్పనిసరి. భూమి ముఖ్యమైన అంశం. సంక్లిష్టమైన అంశం కూడా. అందుకే భూమి సమస్యలు తీరాలంటే సమగ్ర, శాశ్వత పరిష్కారాలు ఆలోచించాలి. వాటిని చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి. అంతేకానీ, ధరణి చుట్టే చర్చ పరిమితమైతే తెలంగాణలో భూమి సమస్యలు పరిష్కారం కావు.
(తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అయింది. ఈ సందర్బంగా మరో సారి.. 2014 లో ‘ల్యాండ్ కారవాన్’ నిర్వహించిన దారిలోనే మళ్ళీ ప్రయాణించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం. వారి అభిప్రాయాల ఆధారంగా మరోసారి తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో రూపొందిస్తాము. మీరూ కలిసి రండి). తెలంగాణ అంటేనే భూమి.. భూమి అంటేనే తెలంగాణ.. భూమి అజెండా అందరి అజెండా కావాలని ఆకాంక్షిస్తూ…
భూమి సునీల్
భూచట్టాల నిపుణులు, న్యాయవాది
ఫోన్ నెంబర్ : 9000222674
ఈ మెయిల్: landsunilindia@gmail.com , vidhathanews@gmail.com