ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశాలు విధాత, మెదక్ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో పెండింగులో ఉన్న మౌలిక వసతుల పనులను (ఇన్ఫ్రా) పక్షం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులకు, ఏజెన్సీలకు సూచించారు. శనివారం పిల్లి కొట్టాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించి లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇంకా మిగిలిపోయిన ఎలక్ట్రిఫికేషన్, […]
విధాత, మెదక్ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో పెండింగులో ఉన్న మౌలిక వసతుల పనులను (ఇన్ఫ్రా) పక్షం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులకు, ఏజెన్సీలకు సూచించారు.
శనివారం పిల్లి కొట్టాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించి లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇంకా మిగిలిపోయిన ఎలక్ట్రిఫికేషన్, డ్రైనేజి, పెయింటింగ్ పనులు, కిటికీలకు అద్దాలు బిగించడం, మంచి నీటి ట్యాంకులు, ప్లంబింగ్ వంటి చిన్న చిన్న పనులను యుద్ధప్రాతిపదికన పక్షం రోజులలో పూర్తి చేయాలన్నారు.
ఇందుకు సంబంధించి అవసరమైన పరిపాలనా అనుమతులు వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. అంతర్గత రహదారుల వెంట పిచ్చి మొక్కలు తొలగించి, రోడ్డును సమాంతరంగా చదును చేస్తూ ప్రతి ఇంటి దగ్గర పూలు, నీడను ఇచ్చే మొక్కలు నాటేలా చూడాలని మునిసిపల్ కమిషనర్కు సూచించారు. క్రీడా మైదానం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. లబ్దిదారులకు అందుబాటులో నూతనంగా రేషన్ దుకాణం, అంగన్వాడీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ ఈఈ పాండురంగా రావు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, మునిసిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, తహశీల్ధార్ శ్రీనివాస్, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు.