టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలలో ఈషా రెబ్బా ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈషా రెబ్బా పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఈషాకి ఉన్నప్పటికీ ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాక స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇప్పుడు ఏవో చిన్నా చితకా సినిమాలు చేస్తూ అలానే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తుంది.వెండితెరపై అరుదుగా కనిపిస్తున్న ఈషా రెబ్బా సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతూ రచ్చ చేస్తుంటుంది. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. ఈషా తాజాగా తన సోషల్ మీడియాలో క్యూట్ వీడియో షేర్ చేయగా, ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఈషా రీసెంట్గా మాల్దీవులకి వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ ఈ ముద్దుగుమ్మ షర్ట్ విప్పి తన క్యూట్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈషా రెబ్బా బాడీ షేప్స్ చూసి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు. నీలి రంగు సముద్రం ఒడ్డున బ్లూ కలర్ డ్రెస్లో ఈషా రెబ్బా అందాల అరాచకం కేక పెట్టిస్తుంది. ప్రస్తుతం ఈషా పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఈషా ఇటీవల దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ప్రెగ్నెంట్ లేడీగా కనిపించి మెప్పించింది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, ఇందులో ఈషా పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది.
2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకి పరిచయం అయింది. ఆ తర్వాత అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేయగా, ఈ చిత్రంకి పాజిటివ్ టాక్ రావడంతో ఈషా రెబ్బాకి అవకాశాలు క్యూ కట్టాయి. బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బాకి ఒక్క కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. అందం, నటన ఉండి కూడా లక్ అనేది ఈషాకు లేకపోవడంతో రేసులో వెనుకబడిపోయింది. టాలీవుడ్ అమ్మాయి అనే వివక్ష కూడా ఈషాని స్టార్ హీరోయిన్ చేయలేకపోయింది.