Kishan Reddy
- నియమించిన జేపీ నడ్డా
విధాత : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా జి.కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మంగళవారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.