Group-2 | సత్యాగ్రహ దీక్షలో ఆర్ఎస్పీ.. కోదండరామ్ల డిమాండ్ హౌజ్ అరెస్టులతో పోలీసుల కట్టడి విధాత: గ్రూప్-2 పరీక్షలను నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వాయిదా వేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్. ప్రవీణ్కుమార్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ లు డిమాండ్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా కోరుతు శనివారం బీఎస్పీ, టీజేఎస్లు ఇచ్చిన పిలుపు మేరకు గన్ పార్కు వద్ధ నిర్వహించాల్సిన సత్యాగ్రహ దీక్షలను పోలీసులు ముందస్తు అరెస్టులు, హౌజ్ అరెస్టులతో […]
Group-2 |
విధాత: గ్రూప్-2 పరీక్షలను నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వాయిదా వేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్. ప్రవీణ్కుమార్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ లు డిమాండ్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా కోరుతు శనివారం బీఎస్పీ, టీజేఎస్లు ఇచ్చిన పిలుపు మేరకు గన్ పార్కు వద్ధ నిర్వహించాల్సిన సత్యాగ్రహ దీక్షలను పోలీసులు ముందస్తు అరెస్టులు, హౌజ్ అరెస్టులతో భగ్నం చేశారు.
ప్రవీణ్కుమార్ను, కోదండరామ్లను పోలీసులు అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టి వారిని సత్యాగ్రహ దీక్షకు వెళ్లకుండా గృహనిర్భంధం చేశారు. దీంతో వారు ఇంట్లోనే మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతు తమ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలో నిరుద్యోగులు, బీఎస్పీ, టీజేఎస్ కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.
అమరుల స్థూపం దగ్గర శాంతి యుతంగా నిరసన చేస్తామని అంటే నన్ను పోలీసులు గృహ నిర్భంధం చేశారన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతి యుతంగా ధర్నా చేసుకోవచ్చని, ప్రభుత్వం రాజ్యంగ హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు.
పోలీస్ అధికారులను నమ్ముకుని కేసీఆర్ పాలన నడిపిస్తున్నారన్నారు. మమ్ములను గృహ నిర్భంధం చేసినట్టు జనాలు రానున్న ఎన్నికల్లో కేసీఆర్ను ఫామ్ హౌజ్ కు పరిమితం చేస్తారన్నారు.
మేం జనాల కోసం పోరాటం చేస్తున్నామని, ఫామ్ హౌజ్ ల కోసం కాదన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇన్ని రోజులకు పరీక్షలు గుర్తుకు వచ్చాయా అంటు సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. పేపర్ లీకేజి కారకుల తోటి మళ్ళీ పరీక్షలు పెడుతున్నారని, ఒక్క నెలలోనే 20 పరీక్షలు ఎలా పెడుతారన్నారు.
ప్రశాంతమైన వాతావరణం లో పరీక్షలు నిర్వహించాల్సివుందని, నిరుద్యోగులు మనుషులా మర మనుషులా అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహారిస్తుందన్నారు. నిరుద్యోగులు పరీక్షలు రాయకుడదన్నట్లుగా సీఎం కేసీఆర్ వైఖరి ఉందని, ఒక్కో పరీక్ష కు ఒక్కో సిలబస్ ఉంటుందని, అన్ని పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారన్నారు. ఎకానమీ సబ్జెక్ట్ కి మెటీరియల్ ఎందుకు ఇవ్వలేదన్నారు.
కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ ను అరెస్ట్ చేయడం బాధాకరమని, రియాజ్ ను టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఇబ్బంది పెట్టారన్నారు. గన్ పార్కు దగ్గర మాకు పర్మిషన్ ఇవ్వలేదని, అదే అధికార పార్టీ ధర్నాలు చేస్తే ఒక్క రూలు, మేము ధర్నాలు చేస్తే ఒక రులా అంటు ప్రశ్నించారు. అధికార పార్టీ వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కేసులు పెట్టరని, మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తే కేసులలు పెడతారా… అధికార పార్టీ వాళ్లకు పోలీస్ బందోబస్తు.. మాకు మాత్రం పోలీస్ లతో కేసులు ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమన్నారు.
గ్రూప్-2 పోస్టులు కల్వకుంట్ల కుటుంబం అమ్ముకున్నారని నిరుద్యోగులు అనుమానం పడుతున్నారని, అందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదా అన్న సందేహాలు వినబడుతున్నాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ వ్యతిరేక పాలన అంతం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామన్నారు. మొన్న అసెంబ్లీ లో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి మీద ఎమ్మేల్యేలు ఎందుకు మాట్లాడలేదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రవీణ్కుమార్ నిలదీశారు.
నిరుద్యోగులు మీకు ఓటు వేయలేదా అని, వారి సమస్యలపై మీరు ఎందుకు మాట్లాడలేదంటు విమర్శించారు. బీఎస్పీని అణచి వేయాలని పోలీసులకు సీఎం కేసీఆర్ సూచనలు చేస్తున్నారని, నియంతలు ఎక్కువ కాలం పాలన చేయలేరన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా గ్రూప్ పరీక్షలు రాస్తే నిరుద్యోగుల బాధ వాళ్లకు అర్థం అయ్యేదని, కేసీఆర్ కొడుకు, బిడ్డ, మనుమడు, చుట్టాలు ఎవరైనా పరీక్షలు రాస్తే నిరుద్యోగుల బాధ సీఎం కేసీఆర్కు అవగాహానకు వచ్చేదన్నారు.
గతంలో గ్రూప్స్ పరీక్షల పేపర్ల లీకేజి అయినప్పుడు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్ అన్నాడని, అది ఏమైంది, ఎంత మందికి ఇచ్చారో లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజి లో నిందితుల పై ఇప్పటి వరకు చార్జి షీట్ ఎందుకు నమోదు చేయలేదన్నారు. నిందితులను కాపాడడానికే సిట్ ఏర్పాటు చేసినట్టు ఉందని, పేపర్ లీకేజి ఘటన పై సీబీఐ విచారణ చేపట్టాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుందన్నారు.