Group-2 | గ్రూప్-2 అభ్యర్థుల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ దిగొచ్చింది. గ్రూప్-2 అభ్యర్థులు, ప్రతిపక్షాల ఆందోళనలతో గ్రూప్-2 వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఎస్పీఎస్సీతో చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కేసీఆర్ సూచించారు. దీంతో ఈ నెల 29, 30వ […]
Group-2 |
గ్రూప్-2 అభ్యర్థుల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ దిగొచ్చింది. గ్రూప్-2 అభ్యర్థులు, ప్రతిపక్షాల ఆందోళనలతో గ్రూప్-2 వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
టీఎస్పీఎస్సీతో చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కేసీఆర్ సూచించారు. దీంతో ఈ నెల 29, 30వ తేదీన నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను నవంబర్ నెలకు వాయిదా పడ్డాయి.
Hon’ble CM KCR Garu has directed the Chief secretary to consult with TSPSC and reschedule the Group-2 exam to ensure no inconvenience is caused to the lakhs of aspirants
He has also advised the Chief secretary to ensure proper staggering of the recruitment notifications in…
— KTR (@KTRBRS) August 12, 2023
భవిష్యత్లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని సూచించారు కేసీఆర్. గ్రూప్-2 పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని దాదాపు 10 వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు నిన్న టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.