CM Jagan ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే! విధాత: అమరావతి కేపిటల్ రీజియన్ లో పేదలకు యాభై వేల ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని భావిస్తున్న జగన్ ఆలోచనలు, ఆశల మీద కోర్టు నీళ్ళు చల్లింది. ఏకమొత్తంలో యాభై వేలమంది పేదలను తన మద్దతుదారులుగా చేసుకోవాలని జగన్ వేసిన ప్లాన్ ను కోర్టు అడ్డుకున్నది. ఈమేరకు జస్టిస్ డీ.వీ.ఎస్.ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరితో కూడిన త్రిసభ్య […]
CM Jagan
విధాత: అమరావతి కేపిటల్ రీజియన్ లో పేదలకు యాభై వేల ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని భావిస్తున్న జగన్ ఆలోచనలు, ఆశల మీద కోర్టు నీళ్ళు చల్లింది. ఏకమొత్తంలో యాభై వేలమంది పేదలను తన మద్దతుదారులుగా చేసుకోవాలని జగన్ వేసిన ప్లాన్ ను కోర్టు అడ్డుకున్నది. ఈమేరకు జస్టిస్ డీ.వీ.ఎస్.ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అక్కడ ఇళ్ల నిర్మాణం మీద స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం వ్యవహారం ఇప్పటికే పలుమార్లు కోర్టుల్లో వాదోపవాదాలు జరిగాయి. అమరావతి కోసం తాము భూములు ఇచ్చామని.. అక్కడ స్థలాలయినా, ఇళ్లయినా తమకే ఇవ్వాలని రాజధాని రైతుల పేరిట కోర్టుల్లో టిడిపి కేసులు వేసింది.
అయితే అది అందరి రాజధాని అని చెబుతూ అక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తూ జగన్ మొన్న ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ పట్టాల పంపిణీకి అనుమతి ఇస్తూనే.. తుది తీర్పుకి లోబడి ప్రవర్తించాలంటూ గతంలో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తరువాత ప్రభుత్వం అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టింది.
అయితే ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీ విషయంలోనే తుది తీర్పు రాకుండానే.. ఇళ్ల నిర్మాణం ఎలా మొదలు పెడతారంటూ రైతులు మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇందులో భాగంగా… స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాల కేటాయింపు అధికారాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేశారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. మరోవైపు ఈ హైకోర్టు ఉత్తర్వులు మీద జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళుతోంది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయాలని కోరుతూ సుప్రీం లో పిటిషన్ వేస్తోంది. మరోవైపు తాము పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఈ టిడిపి పెత్తందారులు అడ్డుకుంటున్నారని వైసిపి ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసింది.