Hydrabad సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని వినతి విధాత: నిబంధనల మేరకు లేని తెలంగాణ రాష్ట్రంలోని గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన వెంకట్రెడ్డి గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని, సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోరుతు వినతి పత్రం అందించారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతు విద్యా రంగంలో దేశం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానని, అదే సమయంలో ఎంతో […]
Hydrabad
విధాత: నిబంధనల మేరకు లేని తెలంగాణ రాష్ట్రంలోని గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన వెంకట్రెడ్డి గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని, సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కోరుతు వినతి పత్రం అందించారు.
అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతు విద్యా రంగంలో దేశం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానని, అదే సమయంలో ఎంతో వేదనతో తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల దోపిడీపై మోడీకి ఫిర్యాదు చేశానన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం, 2018ని ఆమోదించడం ద్వారా అనర్హమైన సంస్థలకు విశ్వవిద్యాలయ హోదా కల్పించిందన్నారు. వాస్తవాలను ధృవీకరించకుండా, నాణ్యతా ప్రమాణాలను చూడకుండా అనుమతులిచ్చిందన్నారు.
అలా రాష్ట్రంలోని గురు నానక్, శ్రీనిధి సంస్థల వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 5 ప్రైవేట్ వర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా, గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదని, అయినా 2022–23 విద్యాసంవత్సరానికి గాను గురునానక్ లో 2,800 వరకూ, శ్రీనిధిలో 300 మంది విద్యార్థులను చేర్చుకున్నారని వెల్లడించారు.
విద్యాసంవత్సరం చివరి వరకూ వేచిచూసినా గవర్నర్ ఆమోదం తెలుపలేదని, దీంతో విద్యార్థులు ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి రావడంతో విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు గురునానక్ వర్సిటీ వద్ద పలుమార్లు ఆందోళనలు చేశారన్నారు.
ఈ విషయంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీని కోరానని, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ సంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలని కోరడం జరిగిందన్నారు. ప్రధాని మోడీ అన్ని విషయాలను విని సానుకూలంగా స్పందించారని వెంకట్రెడ్డి తెలిపారు.