విధాత: మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయిందట.. ఎంప్లాయిస్ యూనియన్ చేసిన పని ఇలాగే ఉంది. ప్రభుత్వం పెద్దగా సీరియస్గా పట్టించుకోవడం లేదు కదాని ఉద్యోగ సంఘాల నాయకులు అలా వెళ్లి ఇలా గవర్నర్ హరి చందన్కు తమ జీతాల గురించి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. ప్రభుత్వంలో పని చేస్తూ మాకు వ్యతిరేకంగా గవర్నర్ను కలుస్తారా అంటూ ఏకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చేసింది. ఇప్పుడీ వ్యవహారం ఉద్యోగులకు.. ప్రభుత్వానికి మధ్య పీఠముడి వేసినట్లు […]
విధాత: మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయిందట.. ఎంప్లాయిస్ యూనియన్ చేసిన పని ఇలాగే ఉంది. ప్రభుత్వం పెద్దగా సీరియస్గా పట్టించుకోవడం లేదు కదాని ఉద్యోగ సంఘాల నాయకులు అలా వెళ్లి ఇలా గవర్నర్ హరి చందన్కు తమ జీతాల గురించి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. ప్రభుత్వంలో పని చేస్తూ మాకు వ్యతిరేకంగా గవర్నర్ను కలుస్తారా అంటూ ఏకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చేసింది. ఇప్పుడీ వ్యవహారం ఉద్యోగులకు.. ప్రభుత్వానికి మధ్య పీఠముడి వేసినట్లు తయారైంది.
సాధారణంగా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో చర్చిస్తూ ఉంటారు. కుదరకపోతే ఆందోళన బాట పడతారు. అటూ ఇటూ పంతానికి పోయిన సందర్భంలో కూడా చర్చలకు ఆస్కారం ఎపుడూ ఉండేది. గతంలో ఎన్నో ప్రభుత్వాలతో ఘర్షణ పడిన ఉద్యోగ సంఘాలు చివరకు చర్చల దగ్గర ఏదోలా పరిస్థితిని చక్కదిద్దుకునే వారు.
మరి ఏపీలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా గవర్నర్ను కలిసి సమస్యలతో పాటు ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసి వచ్చారు. తమకు జీతాలు ప్రతీ నెలా టైంకి చెల్లించడం లేదని ఆర్ధిక అంశాలు అనేకం పెండింగులో పడ్డాయని కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అనేక సార్లు మాట ఇచ్చి తప్పుతోందని కూడా చెప్పడం విశేషం. యూనియన్ అధ్యక్షుడు సూర్యనారాయణ సారథ్యంలో ఉగ్యోగ సంఘాల నాయకులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఇది ఒక విధంగా ప్రభుత్వానికి తలవంపులుగా పరిణమించింది. మరో వైపు చూస్తే సర్వీస్ నిబంధనలకు కూడా ఇది విరుద్ధం కావడంతో ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించకుండా కొరడా తీసింది. దీంతో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయి.
ఆ నోటీసులను సైతం మీడియాలో పత్రికలలో వచ్చిన కధనాల ఆధారంగానే ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా ప్రభుత్వంతో జీతాలు సమస్య సహా ఆర్ధిక పరమైన అనేక అంశాల మీద మాట్లాడేందుకు సంప్రదించేందుకు అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు గవర్నర్ని కలవాల్సి వచ్చింది ప్రశ్నించారు.
గవర్నర్ని కలసి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం అంటే అది ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని తెలియదా అని ప్రశ్నించింది. ఇలా రోసా నిబంధలనకు వ్యతిరేకంగా వెళ్ళిన మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కూడా పేర్కొంది. దీనికి సంజాయిషీని వారం రోజుల లోగా ఇవ్వాలని కూడా ఆదేశించింది.