Karimnagar | ఉద్యోగాల పేరిట యువతకు ఎర.. ముఠా అరెస్టు !
Karimnagar | విధాత బ్యూరో, కరీంనగర్: నిరుద్యోగయువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకుంటూ ఆపై ముఖం చాటేసి, వారిని నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి కటకటాలు పాలు చేశారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గంగారపు మధుమూర్తి చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం […]
Karimnagar |
విధాత బ్యూరో, కరీంనగర్: నిరుద్యోగయువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకుంటూ ఆపై ముఖం చాటేసి, వారిని నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి కటకటాలు పాలు
చేశారు.
మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గంగారపు మధుమూర్తి చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఇప్పిస్తానని వారి వద్ద లక్షలు వసూలు చేసుకుంటూ… వారిని నిలువునా ముంచేశారు.
వీరి వల్ల నష్టపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ నటేష్ వీరి కదలికలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని మంగళవారం అదుపులోకి తీసుకొని వారిని విచారించింది. వారు తమ నేరాన్ని అంగీకరించడంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలియజేశారు. నిందితుల వద్ద నుండి 93 వేల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరు పరిచి వీరు ఎంత మంది వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారు అనే విషయంపై విచారణ జరుపుతున్నారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram