Karnataka విధాత: ఉచితాలు దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం అని ప్రధాని గతంలో అన్నారు. పండుగల సమయాల్లో తరచుగా పంచే ప్రసిద్ధ భారత స్వీట్ అయిన 'రేవాడి'ని మోడీ వివిధ పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడానికి వాగ్దానం చేస్తున్న ఉచితాలకు రూపకంగా ఉపయోగించారు. ప్రజలు ముఖ్యంగా యువత దీని నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని ఎప్పుడూ ప్రవచించే ప్రధాని ఆ స్ఫూర్తిని కొనసాగించి ఉంటే ఆదర్శంగా ఉండేది. కానీ ఆయన చెప్పేదానికి ఆచరణకు ఏమాత్రం […]
Karnataka
విధాత: ఉచితాలు దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం అని ప్రధాని గతంలో అన్నారు. పండుగల సమయాల్లో తరచుగా పంచే ప్రసిద్ధ భారత స్వీట్ అయిన ‘రేవాడి’ని మోడీ వివిధ పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడానికి వాగ్దానం చేస్తున్న ఉచితాలకు రూపకంగా ఉపయోగించారు. ప్రజలు ముఖ్యంగా యువత దీని నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని ఎప్పుడూ ప్రవచించే ప్రధాని ఆ స్ఫూర్తిని కొనసాగించి ఉంటే ఆదర్శంగా ఉండేది. కానీ ఆయన చెప్పేదానికి ఆచరణకు ఏమాత్రం సంబంధం ఉండదు.
ఎన్నికల సమయంలో అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటుంది. మరో అవాకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేస్తుంది. విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతాయి. కానీ నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేసిన అభివృద్ధి కంటే … తీసుకున్న ప్రజా వ్యతిరేకత విధానాలే ఎక్కువగా ఉన్నాయి.
దేశాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి, నల్లధనం కట్టడికి పెద్దనోట్లను రద్దు చేసింది. దీనివల్ల దేశ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా వాళ్లు చెప్పే దేశం కోసం భరించారు. కానీ వాళ్ల ఆశలు వమ్ము అయ్యాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాతనే దేశంలో నల్లధనం తిరిగి దేశాన్ని తెప్పించలేదు. ఈ చర్య ద్వారా సాధించింది ఏమీ లేదని ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలే చెప్పాయి.
బీజేపీ ఎన్నికల సమయంలో మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తుంది. ప్రజల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్ల లబ్ధి పొందాలని చూస్తుంది. అందుకే కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని తొమ్మిదేళ్ల అభివృద్ధి గురించి మాట్లాడకుండా… డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించి ప్రగతి గురించి చెప్పకుండా… కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోపై విమర్శలు చేస్తూ.. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంస్థలను నిషేధిస్తామని, ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించే పరిస్థితులు కల్పిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు ఆదరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది వారికే వదిలేయాలి. కానీ ఒక వర్గం ఓట్ల లబ్ధి కోసం ప్రధాని ఆరాటపడటం హాస్యాస్పదం.
ఇక ఉచితాలు దేశాభివృద్ధికి ప్రమాదం అన్న మోడీ కర్ణాటకలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ఉచితాలను వాగ్దానం చేసి ప్రచారం చేస్తున్నది. మరోవైపు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న నినాదానికి విరుద్ధంగా ఆ రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లు తమకు అక్కరలేదని ఆ పార్టీ నేతలు చెబుతన్నారంటే వాళ్ల వ్యవహారశైలి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఉచితాలు దేశాభివృద్ధికి ఎలా ప్రమాదం కాదు కొంతమంది చేసే విభజన, విద్వేష రాజకీయాలతోనే దేశానికి ప్రమాదమని మేధావులు చాలాకాలంగా అంటున్నారు.