బీఆరెస్, కాంగ్రెస్ పాలనలో రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయని, ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలు..మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషనర్రెడ్డి విమర్శించారు
ధాన్యం కొనుగోలు సమస్యలకు వారే కారణం
బీజేపీ రైతు దీక్షలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
విధాత : బీఆరెస్, కాంగ్రెస్ పాలనలో రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయని, ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలు..మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషనర్రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రైతు డిక్లరేషన్ పేరుతో రైతుల కష్టాలు తీరుస్తామని, గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, క్వింటాల్కు 500బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే నేనున్నా రాహుల్గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫెస్టో పేరుతో 420 హామీలు కాంగ్రెస్ హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు.
దళిత బందు, గిరిజన బంధు పేరుతో కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో వెలుతుందన్నారు. కాంగ్రెస్ రైతురుణమాఫీ అమలు చేయకపోవడంతో బ్యాంకులు అన్నదాతలకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుందని, దీంతో దళారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50లక్షల టన్నుల బియ్యం కేంద్రం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ వెళ్లడం, రాష్ట్రంలో చేసిన వసూళ్లు ఢిల్లీకి అందించడంలో ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలులో లేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారన్నారు. పాత గ్యారంటీలు పక్కన పెట్టి తుక్కుగూడలో కొత్త గ్యారంటీలు ప్రకటించారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మరిచిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎరువులను బ్లాక్లో కొనేవారని, ప్రధాని నరేంద్ర మోదీ ఆ పరిస్థితి లేకుండా చేశారన్నారు.