Jharkhand Encounter: జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం
జార్ఖండ్ రాష్ట్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు.

Jharkhand Encounter : జార్ఖండ్ రాష్ట్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. సోమవారం ఉదయం బొకారా జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ లో ప్రాంతంలో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎస్ఎల్ఆర్, రెండు ఇన్సాస్ రైఫిల్స్ స్వాధీనం, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. అయితే భద్రతా దళాల్లో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.