Mancherial | రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ‘మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ వాదం రోజురోజుకూ బలపడుతోంది. అత్యధిక శాతం బీసీ జనాభా ఉంది. అయినప్పటికీ రాజకీయంగా అగ్రకుల నాయకులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. ఇప్పటికైనా బీసీలందరూ ఐక్యం కావాలి. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి’ అని బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు బీసీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్ లో […]
Mancherial |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ‘మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ వాదం రోజురోజుకూ బలపడుతోంది. అత్యధిక శాతం బీసీ జనాభా ఉంది. అయినప్పటికీ రాజకీయంగా అగ్రకుల నాయకులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. ఇప్పటికైనా బీసీలందరూ ఐక్యం కావాలి. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి’ అని బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు బీసీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్ లో నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కలుపుకొని ఐక్యంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో కుల సంఘం సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పల్లె పల్లెకు, గడపగడపకూ వెళ్లి రాజకీయ అణిచివేత, అన్యాయంపై చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని మంచిర్యాల పట్టణంలో భారీ బీసీ గర్జన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యఅతిథి, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ బీసీ అభ్యర్థిని నిలబెడితే పూర్తిస్థాయిలో తను మద్దతిస్తున్నట్లు తెలిపారు.
కొంత ఆర్థిక సాయం కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశానికి వచ్చిన ముఖ్య బీసీ నేతలు డాక్టర్ రమణ, డాక్టర్ రఘునందన్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోడ శ్రీనివాస్, కర్ర లచ్చన్న, నీలి శ్రీనివాస్ మాట్లాడారు. నియోజకవర్గంలో బీసీ నేతను ఐక్యంగా ప్రకటించి, అన్ని వర్గాలను కలుపుకొని గెలిపించి ప్రధాన పార్టీలకు బీసీ సత్తా చూపించాలని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు