వారం పాటు పర్యవేక్షణ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన మహిళా కుటుంబ సభ్యులు విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో వైద్యనిపుణులు సంయుక్తంగా కృషిచేసి, ఒక మహిళ ప్రాణాలు కాపాడారు. కొల్చారం మండల పరిధిలోని అంసాన్పల్లి గ్రామానికి చెందిన కేతావత్ సురేఖ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండడంతో కుటుంబీకులు ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే బీపీ 60తో ప్రాణాపాయ స్థితికి […]
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో వైద్యనిపుణులు సంయుక్తంగా కృషిచేసి, ఒక మహిళ ప్రాణాలు కాపాడారు. కొల్చారం మండల పరిధిలోని అంసాన్పల్లి గ్రామానికి చెందిన కేతావత్ సురేఖ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండడంతో కుటుంబీకులు ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే బీపీ 60తో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెంటనే గైనకాలజిస్ట్ డాక్టర్ శివ దయాల్ పర్యవేక్షణలో వైద్యులు వసుధ, కిరణ్, దేవిశ్రీ, అనస్థీషియా సునీల్, ప్రజ్జా, స్టాప్ నర్సులు, సిబ్బంది బృందం రెండు యూనిట్ల రక్తం ఎక్కించి సాధారణ స్థితికి తెచ్చారు.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ఫెలోపియన్ ట్యూబుల్లో పెరిగింది. ఆ పెరుగుదలకు తగినట్లుగా సాగలేక ట్యూబులు గాయపడి..ఆ ట్యూబుల్లోంచి వస్తున్న తీవ్రమైన రక్తస్రావాన్ని అరికట్టారు. అనంతరం శస్త్రచికిత్సను ప్రారంభించారు. ఇంకొక యూనిట్ల రక్తం, మరో మూడు యూనిట్ల ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా రక్తం ఎక్కించి రెండు గంటలు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఒక యూనిట్ రక్తం ఎక్కించి చికిత్స అందించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సదరు మహిళకు అందించిన చికిత్స గురించి గైనకాలజిస్ట్ డా శివ దయాల్ మాట్లాడుతూ.. ఎక్టోపిక్ గర్భాన్ని కాపాడటం చాలా కష్టమన్నారు. ముందుగా తెలుసుకోకుండా ఉంటే అండవాహికల్లో పిండం పెరిగినప్పుడు అది పగిలిపోతుందన్నారు. దీంతో పొట్టనిండా రక్తం చేరి తల్లికి ప్రాణాంతకంగా మారుతుందన్నారు.
నొప్పి, బ్లీడింగ్ కావడం, తల తిరిగినట్టు అనిపించినప్పుడు పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదని ఆయన పేర్కొన్నారు. సురేఖ ప్రాణాపాయ సంక్లిష్టత దృష్ట్యా సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఏంసీహెచ్ వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా చంద్రశేఖర్ అభినందించారు.