Singareni | విధాత: సింగరేణి ఉద్యోగ కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS) గా మార్చడంతో పాటు, ఉద్యోగుల పిల్లలకు MBBS సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. […]
Singareni |
విధాత: సింగరేణి ఉద్యోగ కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS) గా మార్చడంతో పాటు, ఉద్యోగుల పిల్లలకు MBBS సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించింది.
సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజిలో మొత్తం150 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి.
మిగతా 127 ఎంబిబిఎస్ సీట్లలో 5% రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఈ అవకాశం మెడికల్ సీట్ల సాధనకు ప్రయోజనకరంగా ఉండనుంది.
సింగరేణి ఉద్యోగులకు, వారి పిల్లలకు శుభవార్త.
పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS) గా మార్చడంతో పాటు, ఉద్యోగుల పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ… pic.twitter.com/E3yGXemgxG
— Harish Rao Thanneeru (@BRSHarish) July 6, 2023