నా భర్త మురళీ ఫోన్ కూడా ట్యాప్ చేశారు: మంత్రి కొండా సురేఖ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో ఆమె భర్త కొండా మురళీతో కలిసి మీడియాతో మాట్లాడారు.

  • By: Somu    latest    Mar 27, 2024 12:12 PM IST
నా భర్త మురళీ ఫోన్ కూడా ట్యాప్ చేశారు: మంత్రి కొండా సురేఖ
  • ట్యాపింగ్ నిందితులను వదలం


విధాత : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో ఆమె భర్త కొండా మురళీతో కలిసి మీడియాతో మాట్లాడారు. తన భర్త కొండా మురళీ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె స్పష్టం చేశారు. బీఆరెస్‌ పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు.


సీఎం కూతురుగా ఉన్నప్పుడు కవిత లిక్కర్ అక్రమ వ్యాపారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లకు పడగలెత్తిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని, మేఘా కృష్ణారెడ్డి బీజేపీకి వెయ్యి కోట్ల రూపాయలను పార్టీ ఫండ్‌గా ఇచ్చారని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం అవినీతిపై నోరు మెదపడం లేదన్నారు. వారంలో ఐదు రోజులు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని ప్రజలు, పార్టీ శ్రేణులకు  హామీ ఇచ్చారు.