విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. భారత జాగృతి విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలు రద్దు చేసినట్లు జాగృతి కార్యాలయం ప్రకటించింది. కమిటీల రద్దు వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటనలో వెల్లడించారు. అకస్మాత్తుగా కవిత జాగృతి కమిటీలను రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆరెస్కు అనుబంధంగా ఉండే జాగృతి కమిటీలను పార్లమెంటు ఎన్నికల సమయంలో రద్దు చేయడానికి కారణలేమై ఉండవచ్చన్న చర్చలు సాగుతున్నాయి. జాగృతి కమిటీలకు చెందిన పలువురు పార్టీ మారే అవకాశముందన్న సమాచారంతోనే ముందస్తు జాగ్రత్తగా కవిత కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం వినిపిస్తున్నది.
జాగృతి కమిటీల రద్ధు.. ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు