MLC Kavitha | కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha పీవీ సేవలను విస్మరించిన కాంగ్రెస్‌ దేశం గర్వించదగ్గ తెలుగుబిడ్డ పీవీ నిజామాబాద్‌లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత విధాత ప్రతినిధి, నిజామాబాద్‌: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత […]

  • Publish Date - August 7, 2023 / 12:14 AM IST

MLC Kavitha

  • పీవీ సేవలను విస్మరించిన కాంగ్రెస్‌
  • దేశం గర్వించదగ్గ తెలుగుబిడ్డ పీవీ
  • నిజామాబాద్‌లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

విధాత ప్రతినిధి, నిజామాబాద్‌: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు.

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. నిజామాబాద్‌లో బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణి దేవి, కుమారుడు ప్రభాకర్ రావుతో కలిసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితీ మొత్తం కుదేలైన సందర్భంలో పీవీ నరసింహా రావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న బంగారం కుదవపెట్టి అన్నమోరామచంద్ర అనుకుంటున్న క్లిష్టసమయంలో ప్రధాని అయిన పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు.

ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నా రని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బహుళ జాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు.

ఆనాడు పీవీ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్ర్య రేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం భారత దేశంలో ఎప్పటికీ మర్పిపోదని స్పష్టం చేశారు. కానీ అటువటి విషయన్ని కూడా మరిచి పోయి కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా పీవీని దేశ ప్రజల మదిలో నుంచి మరిపించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు జరిగాయని, పీవీ ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటిచెబుతామని, ప్రపంచానికి పీవీ స్పూర్తిని పంచుతామని అన్నారు.

కేంద్రంలో విద్యా శాఖ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖగా మార్చి అత్యద్భుతమైన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారని తెలిపారు. పీవీ నరసింహా రావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి సాంఘీక సంక్షేమ పాఠశాలలను సర్వేల్ లో ప్రారంభించారని గుర్తు చేశారు.

ఆ స్పూర్తితో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయా విద్యాలయాలను పాఠశాలలను ఏర్పాటు చేశారని, దాంతో లక్షలాది మంది మేధావులు తయారయ్యారని చెప్పారు. దేశంలో లక్షాలది మందికి తెలంగాణ బిడ్డచేత చదువు ప్రారంభమయ్యిందంటే మనందరం గర్వపడాల
పీవీ నరసింహా రావు విగ్రహం ఏర్పాటుతో నిజామాబాద్‌కు కొత్త కళ వచ్చిందన్నారు.

తెలంగాణ నుంచి ఎదిగి దేశానికి ఎంత సేవ చేశారో అందరికీ తెలుస్తుందని, నూతన ఉత్సాహం వస్తుందని చెప్పారు. సహజంగా తెలంగాణ వాళ్లు చేసింది చెప్పుకోడానికి కొంత తటపటాయిస్తారని, పీవీ నరసింహా రావు కూడా అంతేనన్నారు. పీవీ 14 భాషల్లో మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తి కాదని కొనియాడారు. అంత మేధో సంపత్తి ఉన్న సరే పట్వారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అలానే ఉన్నారన్నారు. ఆహార్యంలో కూడా ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

పీవీకి 65 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత దేశానికి కంప్యూటర్లు వస్తే తన కోసం, తాను పది మందికి పనికి రావడం కోసం కంప్యూటర్ వాడకాన్ని నేర్చుకున్నారని కొనియాడారు. పదవి వస్తే ఉప్పొంగిపోవద్దని, ఎదిగినా కొద్దీ ప్రజల తలలో నాలికలా ఉండి ప్రజల బాధలను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారన్నారు. పీవీ నరసింహా రావు వంటి నాయకత్వపు లక్షణాలు అందరికీ రావాలని కోరుకుంటున్నానన్నారు.

పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పివినరసింహారావు కొడుకు పివి ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, బి ఆర్ యస్ నాయకులు మహేష్ బిగల, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమం త్రాలతో పూర్ణకుంభంతో అతిథులకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

Latest News