Ms Dhoni | విమానంలో ఆ ప‌ని చేసిన ధోని.. సీక్రెట్‌గా వీడియో తీసి బ‌య‌ట‌పెట్టిన ఎయిర్ హోస్టెస్..!

Ms Dhoni: భార‌త క్రికెట్ చరిత్ర‌లో కొంద‌రి పేర్లు సువ‌ర్ణ‌క్షరాల‌తో లిఖించ‌బ‌డి ఉంటాయి. వారిలో ఎంఎస్ ధోని ఒక‌రు. అద్భుత‌మైన ఆట‌తీరుతో పాటు అద‌రొగొట్టే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ధోని రిటైర్ అయి మూడేళ్లు అవుతున్నా కూడా ఆయ‌న‌కి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ధోని సంద‌డి చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది కూడా ధోని ఐపీఎల్ ఆడ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ఆయ‌న భార్య చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ […]

  • Publish Date - July 31, 2023 / 05:52 PM IST

Ms Dhoni: భార‌త క్రికెట్ చరిత్ర‌లో కొంద‌రి పేర్లు సువ‌ర్ణ‌క్షరాల‌తో లిఖించ‌బ‌డి ఉంటాయి. వారిలో ఎంఎస్ ధోని ఒక‌రు. అద్భుత‌మైన ఆట‌తీరుతో పాటు అద‌రొగొట్టే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ధోని రిటైర్ అయి మూడేళ్లు అవుతున్నా కూడా ఆయ‌న‌కి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ధోని సంద‌డి చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది కూడా ధోని ఐపీఎల్ ఆడ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ఆయ‌న భార్య చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక ధోని గురించి ఏ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌, ఆయ‌న‌కు సంబంధించిన ఏ గ్లింప్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన కూడా క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. రీసెంట్గా చెన్నైలో తమ బ్యానర్‌లో నిర్మించిన ‘ఎల్‌జీఎం’ సినిమా ప్రమోషన్స్‌లో ధోని పాల్గొన్న విష‌యం తెలిసిందే.

అయితే ప్ర‌మోష‌న్‌లో పాల్గొనేందుకు ధోనీ, అతని భార్య సాక్షి ఇద్దరూ విమానంలో ట్రావెల్ చేస్తున్నారు . ఆ స‌మ‌యంలో ధోనీ తన సీట్లో మంచి కునుకు వేసాడు. ఇది చూసిన ఒక ఎయిర్ హోస్టెస్ తన ఎగ్జయిట్‌మెంట్ ఆపుకోలేక సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో ధోనీ భార్య సాక్షి ఏదో మ్యాగజైన్ చదువుకుంటూ ఉంది. అయితే ఎయిర్‌హోస్టెస్ వీడియోలో త‌న ఫేస్ రాకుండా జాగ్రత్త ప‌డింది. అయితే ధోనిని చూసి ఆమె మాత్రం చాలా ఎగ్జైట్ అయిన‌ట్టు ఆమె ఫేస్ చూస్తేనే తెలుస్తుంది.ప్ర‌స్తుతం ఆమె షేర్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన కొంద‌రు నెటిజ‌న్స్ ఆయ‌న ప్రైవసీకి ఎయిర్ హోస్టెస్ భంగం కలిగించిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో కూడా చాలా మంది ఎయిర్ హోస్టెస్‌లు ధోనీపై తమ అభిమానాన్ని చాటుకోగా, వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక ధోని ప్ర‌స్తుతం నిర్మాత‌గా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ధోని ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాపించి ‘ఎల్‌జీఎం ’ అనే చిత్రాన్ని నిర్మించారు. ధోని భార్య సాక్షి సింగ్ నిర్మాతగా రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ఈ చిత్రం ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. జూలై 28న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ పొందింది. అయితే ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించగా ఆ కార్యక్రమంలో పాల్గొని ధోని సంద‌డి చేశారు.

Latest News