విధాత, సినిమా: RRR చిత్రం తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన ప్రతిభను చాటారు. ఆయన నటినా ప్రతిభను చూసిన హాలీవుడ్ మేకర్స్ కూడా ఆశ్చర్య పోయారు. ఆయన నటనా సామర్థ్యం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. తాజాగా ఎన్టీఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రం చేస్తున్నాడు. దీనికి NTR30 అనే వర్కింగ్ టైటిల్గా పిలుస్తున్నారు. సాధారణంగా దర్శకధీరుడు రాజమౌళి ఒక హీరోతో సినిమా చేస్తే వారి […]
విధాత, సినిమా: RRR చిత్రం తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన ప్రతిభను చాటారు. ఆయన నటినా ప్రతిభను చూసిన హాలీవుడ్ మేకర్స్ కూడా ఆశ్చర్య పోయారు. ఆయన నటనా సామర్థ్యం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. తాజాగా ఎన్టీఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రం చేస్తున్నాడు. దీనికి NTR30 అనే వర్కింగ్ టైటిల్గా పిలుస్తున్నారు.
సాధారణంగా దర్శకధీరుడు రాజమౌళి ఒక హీరోతో సినిమా చేస్తే వారి తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. అందుకు తగ్గట్టుగానే చరణ్కు RRR తరువాత ఆచార్య వంటి డిజాస్టర్ ఎదురయింది. ఇప్పుడు వంతు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది.
అందునా కొరటాల శివ కూడా టాలీవుడ్లోనే మోస్ట్ డిజాస్టర్ మూవీ ఆచార్యను తెరకెక్కించి విమర్శల పాలైన తరువాత.. చిరు పదేపదే కొరటాల శివ దర్శకత్వం గురించి ఇన్ డైరెక్ట్గా అన్ని వేదికలపై పంచులు వేస్తున్నాడు. ఇలాంటి సమయంలో తనను తాను నిరూపించు కోవడం కోసం కొరటాల శివ పట్టుదలగా ఉన్నాడు.
ఇక ఎన్టీఆర్ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంటును అధిగమించడానికి ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సినిమాపై ప్రారంభానికి ముందే చాలా అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ వంటి చిత్రం వచ్చింది. ఈ సినిమాని యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మాస్ లుక్ ఓకే అయినట్లుగా టాక్ వస్తుంది.
ఎన్టీఆర్ ఇందులో చేపలు పట్టే బెస్తరి పాత్రలో కనిపిస్తున్నాడని సమాచారం. ఇక ఎన్టీఆర్ సరసన నటించే బ్యూటీ విషయంలో పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కియారా అద్వానీ, అలియా భట్ పేర్లు గట్టిగా వినిపించినప్పటికీ అందరి దృష్టి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్పైనే పడింది. చిత్ర మేకర్స్ కూడా జాన్వీని సంప్రదించారు. ఇప్పుడు ఏకంగా ఫోటో షూట్ టెస్ట్ కూడా జరిగినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆవారాకు సీక్వెల్గా కోలీవుడ్లో రూపొందుతున్న చిత్రంలో జాన్వీ నటిస్తోందని వార్తలు వచ్చాయి. వాటిని బోనీకపూర్ ఖండించాడు. కానీ తెలుగులో నటించే విషయమై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దాంతో జాన్వీ ఎంట్రీ ఖరారైందని తెలిసిపోయింది. రీసెంట్గా జాన్వీ హైదరాబాద్కు వచ్చి వెళ్ళిందట. అది కూడా ఎన్టీఆర్ చిత్రం కోసం లుక్ టెస్ట్ కోసమే వచ్చిందనేది వాదన.
జాన్వీకి సంబంధించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ షూట్ కోసం జాన్వీ రెండు రోజులు హైదరాబాద్లో ఉందని తెలుస్తోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
త్వరలోనే మూవీ లాంచ్ ఉంది కాబట్టి అదే రోజు అఫీషియల్గా జాన్వీ పేరు అనౌన్స్ చేస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి జాన్వీ కపూర్ ఫొటోషూట్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. కొన్ని ఫొటోలు కూడా లీక్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ లీక్డ్ ఫొటోలలో జాన్వీ హాట్ హాట్గా కనిపించి.. పిచ్చెక్కించేసిందనేలా టాక్ని రాబట్టుకుంటుండటం విశేషం.
తమిళ్కు నో.. తెలుగుకు సై? జాన్వి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్!