9,231 పోస్టులకు తొమ్మిది నోటిఫికేషన్లు ఈ నెల 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ.. విధాత: గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియకు నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకుల పోస్టులకు ఓటీఆర్ సౌకర్యం రేపటి నుంచి అందుబాటులోకి రానున్నది. ఓటీఆర్ ద్వారా వచ్చే నంబర్తో నోటీఫికేషన్ల వారీగా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి […]
విధాత: గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియకు నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకుల పోస్టులకు ఓటీఆర్ సౌకర్యం రేపటి నుంచి అందుబాటులోకి రానున్నది.
ఓటీఆర్ ద్వారా వచ్చే నంబర్తో నోటీఫికేషన్ల వారీగా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసింది.
గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీచేసిన విషయం విదితమే. ఈ పోస్టులకు కేటగిరీల వారీగా ఈ నెల 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఎక్కువ సమయం వేచి చూడకుండా వెంటనే ఓటీఆర్ నమోదు పూర్తి చేయాలని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.