విధాత: లోకేష్ ఈనెల 27నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. అయితే చివర్లో మాత్రం నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి షరతులు విధించారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.. అనుమతులు ఇవ్వకుంటే రచ్చ చేద్దామని చూసిన టీడీపీ ఆశలమీద ప్రభుత్వం నీళ్లు చల్లుతూనే నిబంధనల పేరిట లోకేష్ ముబ్దరి కాళ్లకు బంధం వేసింది. 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా […]
విధాత: లోకేష్ ఈనెల 27నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. అయితే చివర్లో మాత్రం నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి షరతులు విధించారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.. అనుమతులు ఇవ్వకుంటే రచ్చ చేద్దామని చూసిన టీడీపీ ఆశలమీద ప్రభుత్వం నీళ్లు చల్లుతూనే నిబంధనల పేరిట లోకేష్ ముబ్దరి కాళ్లకు బంధం వేసింది.
27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో 26వ తేదీ సాయంత్రం నారా, నందమూరి కుటుంబ సభ్యులు కుప్పం వస్తారని తెలుస్తోంది. 27న కుటుంబాల ఆశీస్సులు తీసుకున్నాక కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది.
400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 125 నియోజక వర్గాలను కవర్ చేస్తూ సాగేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది.
ఈ నేపథ్యంలో జనవరి 23న లోకేష్ జన్మదినం కావడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాలో #happybirthdaylokesh అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే మరో నాలుగు రోజుల్లో లోకేష్ పాదయాత్ర మొదలు కానున్న క్రమంలో యువగళం పేరుతో ప్రచార చిత్రాలు టీజర్లు ట్రైలర్లను అభిమానులు రూపొందించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.