Site icon vidhaatha

President Murmu | హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

President Murmu

విధాత: హైదరాబాద్‌ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, సీఎం కేసీఆర్‌లు శాలువా కప్పి, పూలబొకే అందించి ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిష్‌న్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్ , సి హెచ్ మల్లారెడ్డి , ఎంపీ లు జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎంపీ వెంకటేష్ నేత , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , మధుసూదనా చారి , నవీన్ కుమార్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , డీజీపీ అంజనీ కుమార్ , మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.

Exit mobile version