Sai Dharam Tej యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. హీరోగా ఈ చిత్రంలో మళ్లీ రీ లాంచ్ అవుతున్నట్లుగా సాయిధరమ్ తేజ్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మిస్టీక్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ‘సార్’ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21 భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ […]
Sai Dharam Tej
యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. హీరోగా ఈ చిత్రంలో మళ్లీ రీ లాంచ్ అవుతున్నట్లుగా సాయిధరమ్ తేజ్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మిస్టీక్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ‘సార్’ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రంతో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21 భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ గ్రాండ్ స్కేల్లో నిర్వహిస్తోంది. ప్రమోషన్స్లో భాగంగా బుధవారం హీరో సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పుకొచ్చారు.
‘‘విరూపాక్ష చిత్రం 80, 90వ దశకంలో జరిగిన కథగా నడుస్తుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్లు ఏంటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు ఆ పని చేసి ఉంటారు? అనే దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను.. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం కాబట్టే.. విరూపాక్ష అని టైటిల్ పెట్టాం.
మొదటి సారి ఇలాంటి కొత్త జానర్ చేశాను. నేను ఇంతకు ముందు జీవించాను. కానీ ఇప్పుడు మాత్రం నటించాను. ప్రతీ ఒక్క హీరోకి ప్రతి సినిమా మొదటి సినిమాలానే ఉంటుంది.. అలానే కష్టపడతారు. నేను కూడా ఈ సినిమాని మొదటి సినిమా అనుకునే చేశారు. రీ బర్తే కాదు.. రీ లాంఛ్ వంటిది నాకీ సినిమా.
ఈ సినిమాను కాంతార సినిమాతో పోల్చలేను. అది కల్ట్ క్లాసిక్. ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇండియానా జోనస్ సినిమాలు నాకు చాలా ఇష్టం. హారర్ సినిమాలు చూడటం వేరు.. చేయడం వేరు. ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ నాకు మళ్లీ మాటలు నేర్పించారు. నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. 36 ఏళ్ల వయసులో మళ్లీ నాకు మాటలు నేర్పించారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి. అందుకే ఈ సినిమా విషయంలో పదే పదే మా అమ్మ ప్రస్తావన తీసుకువస్తున్నాను.
నేను చేతబడి తరహా వంటి వాటిని నమ్మను. కానీ ఆంజనేయుడిని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏమీ కాదని నమ్ముతా. నాకు మాస్ ఇమేజ్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్ వచ్చిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓ మంచి సినిమా చేయాలని, మంచి కారెక్టర్ చేయాలని అనుకునే చేశాను. ఏదో ఒక ఇమేజ్ వస్తుందని ఇంత వరకు ఏ సినిమా చేయలేదు.
విరూపాక్ష సినిమాకు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉంటారు. కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా నాలోని నటుడికి పరీక్ష పెట్టినట్టు అనిపించింది. చాలెంజింగ్గా అనిపించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తోంది. మన తెలుగుదనాన్ని పాన్ ఇండియా వైపు తీసుకెళ్లాలి. ఇప్పుడు మన స్థాయి పెరిగింది. ప్రపంచానికి మన తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాం.
నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాలంటే.. జీవితం అన్నాక కష్టాలు సహజం. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తర్వాత పెద్ద మావయ్య (చిరంజీవి) ఓ కొటేషన్ పంపించారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి’ అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్ను పంపించారు.
అది నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. యాక్సిడెంట్ నుంచి త్వరగా కోలుకునేలా చేసింది’’ అని సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) చెప్పుకొచ్చారు. కాగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బాపినీడు బి.సమర్పణలో.. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందించారు.