Basara IIIT | హాలిడేస్ ముగిసిన క్యాంపస్కి రాని విద్యార్థులు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర. నేలరాలిన విద్యా కుసుమాలు. విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గత వారం రోజుల క్రితం PUC మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ నెల 11 నుంచి 15 వరకు హోమ్ సిక్ హాలిడేస్ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ వెంకట రమణ ప్రకటించారు. అయితే నిన్నటితో […]
Basara IIIT |
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గత వారం రోజుల క్రితం PUC మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ నెల 11 నుంచి 15 వరకు హోమ్ సిక్ హాలిడేస్ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ వెంకట రమణ ప్రకటించారు. అయితే నిన్నటితో హాలిడేస్ ముగిసినప్పటికీ విద్యార్థులు క్యాంపస్కు రావడం లేదు.
బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో 1492 మంది విద్యార్థులకుగాను 56 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకు మీటింగ్ నిర్వహించి వారిని ఇంటికి పంపించారు. వీసీ, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల జాగ్రత్తలు వహించాలని, క్యాంపస్లో శ్రద్ధగా చదువుకునేలా మానసికంగా తల్లిదండ్రులు సిద్ధం చేసి పంపాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తుపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని భరోసా కల్పించి సెలవుల తరువాత పంపాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీ నిర్వాకులు స్టూడెంట్స్ పై ఒత్తిడి తగ్గించి, భరోసా కల్పించేం దుకు ఒక్కో లెక్చరర్ వంద మందికి మెంటార్గా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలింగ్ కోసం కౌన్సిలర్ ల సంఖ్య పెంచాలని గర్ల్స్ కోసం మహిళ టేకర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులతో వారానికి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థుల సమస్యల, ఇబ్బందులపై కమిటీ.. మెస్ క్వాలిటీని చెక్ను లెక్చరర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కాలేజీకి నేటి వరకు 4 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని సమాచారం.