కాంగ్రెస్ పార్టీకి షాక్‌: ‘ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి’ రాజీనామా

విధాత: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు పంపించారు. త‌న‌కు నోటీసులు పంపడం ప‌ట్ల తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాన‌ని, ఆ క్ర‌మంలోనే పార్టీకి రాజీనామా చేశాన‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ఉన్న మ‌హేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం బండి సంజ‌య్, ఈట‌ల రాజేంద‌ర్‌తో క‌లిసి […]

  • Publish Date - April 13, 2023 / 12:38 AM IST

విధాత: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు పంపించారు.

త‌న‌కు నోటీసులు పంపడం ప‌ట్ల తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాన‌ని, ఆ క్ర‌మంలోనే పార్టీకి రాజీనామా చేశాన‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి చెప్పారు.

ఢిల్లీలో ఉన్న మ‌హేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం బండి సంజ‌య్, ఈట‌ల రాజేంద‌ర్‌తో క‌లిసి త‌రుణ్ చుగ్ నివాసానికి వెళ్లి అక్కడ బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను క‌లిశారు.

Latest News