రహదారి నిర్మాణ సిబ్బందిపై దాడి ప్రైవేటు కంపెనీ 6 వాహనాలకు నిప్పు Jharkhand | విధాత: జార్ఖండ్లోని పలాము జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ప్రైవేట్ రహదారి నిర్మాణ కంపెనీకి చెందిన ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇద్దరు ఉద్యోగులపై కూడా దాడికి పాల్పడ్డారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హల్దియా ఘాటి ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి గురువారం తెలిపారు. దాదాపు […]
Jharkhand | విధాత: జార్ఖండ్లోని పలాము జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ప్రైవేట్ రహదారి నిర్మాణ కంపెనీకి చెందిన ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇద్దరు ఉద్యోగులపై కూడా దాడికి పాల్పడ్డారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హల్దియా ఘాటి ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి గురువారం తెలిపారు.
దాదాపు 15 మంది మావోయిస్టులు రోడ్డు నిర్మాణ స్థలం వద్దకు చేరుకుని కంపెనీకి చెందిన ఇద్దరు సిబ్బందిని కొట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు ఛతర్పూర్ సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అజయ్కుమార్ వెల్లడించారు.