Special Trains | హోలీకి మరో 14 రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హోలీ పండుగ సందర్భంగా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను పలుమార్గాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో 14 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా రద్దీ నేపథ్యంలో సంత్రగాచి-మహబూబ్నగర్, మహబూబ్నగర్-సంత్రగాచి, చెన్నై సెంట్రల్ – సంత్రగాచి, సంత్రగాచి-చెన్నై సెంట్రల్, దానాపూర్-కొచ్చువేలి, సంత్రగాచి-హుబ్లి, హుబ్లి – సంత్రగాచితో పాటు పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించనున్నాయి. మార్చి 19 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు ఆయా మార్గాల్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram