Suryapet విధాత: సూర్యాపేట నియోజకవర్గంలో ప్రవేశించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఆర్. దామోదర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తోపులాట సాగింది. సూర్యాపేట మండలం కుసుమవారి గూడెంలో భట్టి పాదయాత్రలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు వేరువేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. […]
Suryapet
విధాత: సూర్యాపేట నియోజకవర్గంలో ప్రవేశించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఆర్. దామోదర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తోపులాట సాగింది.
సూర్యాపేట మండలం కుసుమవారి గూడెంలో భట్టి పాదయాత్రలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు వేరువేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
అంతకు ముందు భట్టి పాదయాత్ర నల్లగొండ జిల్లా నుండి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించే సమయంలో మూసీనదిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పరిసర గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజల అభిమానం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అనిపిస్తోందన్నారు.
పీపుల్స్ మార్చ్ లో కదం తొక్కున్న కార్యకర్తల ఉత్సాహము, ప్రజాభిమానంతో సూర్యాపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడవరకూ చూస్తున్నాననీ.. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలను నెరవేర్చుకోలేమని ప్రజలు భావిస్తున్నారన్నారు.
కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, ఉద్యోగాల కోసమని, అవేవీ సొంత రాష్ట్రంలో అమలు కాలేదు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో లక్షల కోట్ల రూపాయాలు కేూటాయించారనీ, అవి సరిపోక 5లక్షల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. సూర్యాపేట జిల్లాకు కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టి..అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అని విమర్శించారు.
ఇక్కడ నుంచి ప్రాతనిథ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పితీరాలన్నారు. ఇక్కడ మొదలు పెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాకు నీరు కూడా తీసకురాలేదన్నారు. మూసీ ప్రాజెక్టులో పూడిక తీయించలేదన్నారు.
అప్పట్లో కేసీఆర్ ఇక్కడ కుర్చీ వేసుకుని కుర్చుని మూసీ పూడిక తీయిస్తానని చెప్పాడన్నారు. కనీసం కాలువల మరమ్మత్తులు కూడా నిధులు విడుదల చేయించ లేదన్నారు. గోదావరి జలాలను ఈ జిల్లాకు తీసుకువస్తున్నామని.. కేసీఆర్ కాలేశ్వరం నీళ్లంటూ.. పెద్ద ఎత్తున మోసపూరిత ప్రచారం చేస్తున్నారన్నారు.
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి, మిడ్ మానేరు నుంచి వస్తున్న నీళ్లు మాత్రమే సూర్యాపేట జిల్లాకు వస్తున్నాయన్నారు. అంతేకాక మేము తవ్విన కాకతీయ కాలువ ఫేజ్ 2 కాలువను విస్తరించడంతో ఇక్కడకు నీళ్లు వస్తున్నాయన్నారు. ఆ నీళ్ల దగ్గరికెళ్లి పూలు, కుంకుమ జల్లి కేసీఆర్ నీళ్లని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.
నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి తెలియని ప్రజలను పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం తప్పు దోవపట్టిస్తోందన్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కోన్నారని, కేసీఆర్ మాయ మాటలు నమ్మడం లేదన్నారు. ఇటు కృష్ణా, అటు గోదావరి నదినుంచి గానీ ఒక్క చుక్క నీరు కూడా అదనంగా ఒక్క ఎకరాకు పారించలేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్నిబంగాళాఖాతంలో కలిపితేనే ఇక్కడి ప్రజలకు నీళ్లు వస్తాయన్నారు. రేపంతా సూర్యాపేట జిల్లాలోనే ఉంటానని, ఎవరికైనా ప్రాజెక్టులు, నీళ్లపై సందేహాలుంటే.. నేరుగా మాట్లాడవచ్చన్నారు.