Congress | కాంగ్రెస్ టికెట్లకు దరఖాస్తుల షురూ
అభ్యర్థుల ఖరారులో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే తుది నిర్ణయం అప్లికేషన్స్ విడుదల చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Congress | విధాత : కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశావహులు, పార్టీ నాయకుల నేటి నుంచి ఈ నెల 25వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం అప్లికేషన్స్ విడుదల చేశారు. ఆయన వెంట సీఎల్పీ […]

- అభ్యర్థుల ఖరారులో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే తుది నిర్ణయం
- అప్లికేషన్స్ విడుదల చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Congress | విధాత : కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశావహులు, పార్టీ నాయకుల నేటి నుంచి ఈ నెల 25వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం అప్లికేషన్స్ విడుదల చేశారు. ఆయన వెంట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ క్యాంపెయినింగ్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని స్పష్టం చేశారు. ఈరోజు నుంచి దరఖాస్తుల కార్యక్రమం మొదలైందని వెల్లడించారు.
ఈ నెల 25 వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. పార్టీకి వారు చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తారని వెల్లడించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్దారించాకే అభ్యర్థులను ఫైనల్ చేస్తారని తెలిపారు.
అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా అవన్ని ఊహాగానాలే అవుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని అన్నారు. గతంలో హామీ ఇచ్చారని జరిగే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టండని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.