విధాత: సాధారణంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వారి నుంచి దూరంగా ఉంటాం.. వారిని వదిలించు కోవాలని చూస్తాం. అదే పని పదే పదే జరుగుతూ ఉంటే మాత్రం మనలోనే ఏదో తప్పు ఉందని అర్థం చేసుకోవాలి. అందునా సినిమా ఫీల్డ్ అనేది రంగుల ప్రపంచం. అక్కడ తళుకు బెళుకులు ఎక్కువ. అందునా కొత్తగా ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన వారు మొదటి చిత్రానికే వాపుని చూసి బలుపు అనుకొని తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది ఆయా హీరోలకి […]
విధాత: సాధారణంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వారి నుంచి దూరంగా ఉంటాం.. వారిని వదిలించు కోవాలని చూస్తాం. అదే పని పదే పదే జరుగుతూ ఉంటే మాత్రం మనలోనే ఏదో తప్పు ఉందని అర్థం చేసుకోవాలి. అందునా సినిమా ఫీల్డ్ అనేది రంగుల ప్రపంచం. అక్కడ తళుకు బెళుకులు ఎక్కువ. అందునా కొత్తగా ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన వారు మొదటి చిత్రానికే వాపుని చూసి బలుపు అనుకొని తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది ఆయా హీరోలకి దెబ్బ బడుతుంది. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ విషయంలో అదే జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ అతి చిన్న చిత్రం మొత్తంగా 50 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీకి రైటర్ కూడా. విమల్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ.. ఊహించని బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు లభించిన అనూహ్య స్పందన చూసి ఈ చిత్ర హీరో సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. దీనికి సీక్వెల్గా ‘టిల్లు 2’.. అదే ‘టిల్లు స్క్వేర్’ మూవీని మొదలుపెట్టారు. కానీ చిత్ర విచిత్రంగా ఈ సినిమా విషయంలో జరుగుతూ వస్తుంది.
ముందుగా ‘డీజే టిల్లు’ విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు విమల్ కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడు. ఇక ‘డీజే టిల్లు’ చిత్రంలోని ముగింపులో ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్టుగా చూపించి ‘టిల్లు స్క్వేర్’ అంటూ సీక్వెల్కు శ్రీకారం చుట్టారు. అయితే అదేమీ విచిత్రమో గానీ ఈ సినిమా పట్టాలెక్కకుండానే సీక్వెల్ చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. దర్శకుడు పారిపోయాడు. విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్రామ్ చేరాడు. మొదట డీజే టిల్లులో నటించిన హీరోయిన్ నేహా శెట్టిని రిపీట్ చేయాలని భావించారు.. కానీ ఆమె కూడా బయటకు వెళ్లిపోయింది.
ఆ స్థానంలో తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండి, తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. సిద్దు జొన్నలగడ్డ వంటి హీరో సరసన అనుపమ పరమేశ్వరన్ నటించడానికి అంగీకరించడమే ఓ గొప్ప విషయమని చాలామంది జోకులు వేశారు. ఈమధ్య అనుపమ పరమేశ్వరన్ షూట్ మొదలవ్వగానే ఈ చిత్రం నుంచి తప్పుకొని ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా ప్రతి ఎగ్జిట్.. మరో ఎంట్రీకే అని తెలివిగా పోస్ట్ పెట్టింది. దాంతో అనుపమ ఈ మూవీ నుంచి తప్పుకుందని క్లారిటీ వచ్చేసింది.
ఇక మరోసారి హీరోయిన్ వేట కొనసాగింది. ‘ప్రేమమ్’ చిత్రంలో నటించిన మడోన్నాసెబాస్టియన్ని ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఎంతోకాలంగా తెలుగులో స్థిర పడాలని చూస్తున్న మడోన్నాకి ఇది చక్కటి అవకాశమేనని అందరూ భావించారు. తాజాగా ఆమె కూడా ‘టిల్లు స్క్వేర్’ నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. ఈ స్థానంలో చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో కలిసి తాజాగా విడుదలైన ‘హిట్ 2’ ఫేమ్ మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ టిల్లు దెబ్బకు ఆమె కూడా బయటకు వెళ్లే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.
‘డీజే టిల్లు’ చిత్రంలో హీరో సిద్దు జొన్నలగడ్డకు తప్ప హీరోయిన్ క్యారెక్టర్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. ఆ కారణంగానే ఇంత మంది హీరోయిన్లు ఈ చిత్రం నుంచి వాకౌట్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తుంది. వాస్తవానికి ఒక ప్రాజెక్ట్ని ప్రకటించిన తర్వాత హీరోయిన్లు మారడం సహజంగా జరుగుతుంది. అయితే ఒక్కసారి సెట్స్ పైకి వెళ్లాక మాత్రం హీరోయిన్లు తప్పుకోవడం బహు అరుదుగా జరుగుతుంది. వాటికి అనేక కారణాలు ఉంటాయి.
అయితే పదేపదే హీరోయిన్లు మారుతూ ఉంటే సినిమాపై నెగటివ్ ప్రభావం పడి పలు అనుమానాలు వస్తాయి. ముందుగా టిల్లు 2 లో హీరోయిన్గా ‘పెళ్లిసందడి’ ఫేమ్ శ్రీ లీలను అనుకున్నారు. ఆ తర్వాత సంగతి తెలిసిందే. ఒకటో హీరోయిన్ రెండో హీరోయిన్ మూడో హీరోయిన్ అంటూ.. రోజుకో హీరోయిన్ తెర పైకి వస్తుంది.
ఇన్సైడ్ టాక్ ప్రకారం డీజే టిల్లు 2 సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్లో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని, ఇలాంటి ముద్దు సీన్లు చాలా ఉండటంతో వాటిలో నటించడానికి ఇబ్బంది అవుతుందని భావించి.. ముందుగానే ఒక్కొక్కరు నో చెబుతున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఒకే ఒక చిత్రం హిట్ చూసుకుని.. సిద్దు జొన్నలగడ్డ డామినేషన్, ఈగో, విపరీతమైన కోపం వంటి వాటి వలన దర్శకుడు నుంచి హీరోయిన్ల వరకు అంతా వరుస పెట్టి చిత్రం నుంచి తప్పుకుంటున్నారనేలా కూడా వినబడుతోంది. మరి.. వీటిలో ఏది నిజమో.. ఆ చిత్రబృందానికే తెలియాలి.