Site icon vidhaatha

చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

విధాత : సీఎం కేసీఆర్, శోభ దంపతులు సిద్దిపేట జిల్లా చింతమడక పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన కేసీఆర్, శోభలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి వెంట మంత్రి టి.హరీశ్‌రావు కూడా ఉన్నారు.

Exit mobile version