Warangal | ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు విధాత: కాకతీయ మెడికల్ కాలేజీలో మరో పీజీ విద్యార్థిని లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతి ఘటన మరువక ముందే కాకతీయ మెడికల్ కాలేజీలో లాస్య ఆత్మహత్యా ప్రయత్నం చేయడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హైదరాబాద్కు చెందిన లాస్య కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఆర్థోపెడిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.కాకతీయ మెడికల్ కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా లాస్య కొద్దికాలంగా మైగ్రేన్ […]
Warangal |
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
విధాత: కాకతీయ మెడికల్ కాలేజీలో మరో పీజీ విద్యార్థిని లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతి ఘటన మరువక ముందే కాకతీయ మెడికల్ కాలేజీలో లాస్య ఆత్మహత్యా ప్రయత్నం చేయడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
హైదరాబాద్కు చెందిన లాస్య కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఆర్థోపెడిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.కాకతీయ మెడికల్ కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా లాస్య కొద్దికాలంగా మైగ్రేన్ తో బాధ పడుతున్నదని, శుక్రవారం రాత్రి ఎంజీఎంలో విధులు నిర్వహించిన లాస్య తలనొప్పి ఎక్కువ ఉండడంతో నిద్రమాత్రలు వేసుకున్నదని మరో వాదన వినిపిస్తోంది. నిద్ర మాత్రలు డోస్ ఎక్కువ కావడంతో లాస్య స్పృహ కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే లాస్యకు ఎంజిఎంలోని ఆర్ఐసీయూ( RICU) విభాగంలో ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ వర్గాలు, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఈ సంఘటన పై పూర్తి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నది. కాగా ప్రీతి సంఘటన జరిగిన కొద్ది రోజులకే లాస్య సంఘటన జరుగడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.