YSRను కుట్ర చేసి చంపారు: వైఎస్ షర్మిల
విధాత: వైఎస్ఆర్ మరణంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని, భయం లేదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్కు ఫిర్యాదు చేశారని, తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఈ బేడీలకు […]

విధాత: వైఎస్ఆర్ మరణంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు.
తాను వైఎస్ఆర్ బిడ్డనని, భయం లేదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్కు ఫిర్యాదు చేశారని, తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఈ బేడీలకు తాను భయ పడనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ప్రజల కోసం తాను బ్రతికినంతకాలం పోరాటం చేస్తానన్నారు. తనను ఎదుర్కోలేని దద్దమ్మలు పోలీస్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనను అవమానిస్తే వైఎస్సార్ బిడ్డగా తాను కేసు పెట్టినా పోలీసులు స్పందించలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై కేసు పెట్టేందుకు ఎకమైన పాలమూరు ఎమ్మెల్యేలు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఏకమై ఉంటే బాగుండేదన్నారు. అవినీతిపై మాట్లాడితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు అంత భయమెందుకని షర్మిల ప్రశ్నించారు.
తన పాదయాత్రను ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని, తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ‘‘ఒకడు మరదలు అంటాడు.. ఒకడేమో వ్రతాలు అంటాడు.. మంత్రి నిరంజన్ రెడ్డి పై తాను వ్యాఖ్యలు చేస్తే కేసు పెట్టారు.
కానీ తనపై ఆయన చేసిన విమర్శల మీద కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని షర్మిల అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ శాఖను టీఆర్ఎస్లో విలీనం చేయండి.. ఆర్ఎస్ఎస్లా టీఆర్ఎస్కు ఒక సైన్యంలా పనిచేయండి.’’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.