ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌ స్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల కస్టడీ విధించింది
విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌ స్ అవెన్యూ కోర్టు మరో 15 రోజుల కస్టడీ విధించింది. ఏప్రిల్ 15 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. జైలులో కేజ్రీవాల్ కోరుకున్న పుస్తకాలను చదివేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో లిక్కర్ స్కాం నిందితులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కవిత తదితరులు కూడా ఉన్నారు