విధాత, హైదరాబాద్ : ప్రముఖ నటి, బీజేపీ ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేందుకే ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది. ఖుష్బు సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో 14 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నానని,. ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనసు మార్పును సూచిస్తోందని ఖుష్బు తన ట్వీట్లో పేర్కోంది. బీజేపీకి పూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే జాతీయ మహిళా కమిషన్ కు రాజీనామా చేశానని తెలిపింది. ఇక ఇన్ని రోజులు మహిళా కమిషన్ లో పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లకు ధన్యవాదాలని పేర్కొంది. జాతీయ మహిళా కమిషన్లో తన సేవలకు కొన్ని పరిమితులు ఉండటంతో, ఇప్పుడు రాజీనామా తర్వాత తనను తాను పూర్తిగా బీజేపీ మిషన్కు అంకితం చేసుకునే వీలు కలుగుతుందని ఆమె తన పోస్టులో వెల్లడించారు. తాను ఇప్పుడు హృదయపూర్వకంగా సేవ చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు చెప్పారు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం ‘కమలాలయం’లో జరిగే జెండా కార్యక్రమానికి హాజరుకానున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్న బీజేపీకి ఖష్పూ సుందర్ ప్రముఖ నాయకురాలిగా ఉన్నారు. కాగా ఖుష్బు నిర్ణయాన్ని ఆమె మద్దతుదారులు స్వాగతించారు.
Khushbu Sundar | జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి ఖుష్బు రాజీనామా
ప్రముఖ నటి, బీజేపీ ముఖ్యనేత ఖుష్బు సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు