Venu Swamy: తప్పైంది.. క్షమించండి

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య జంటపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని, ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోష్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు వేణు స్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు.
దీంతో వేణు స్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దానికి ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి. హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయినా ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు. తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఉమెన్ కమిషన్ మరొసారి నోటీసులు జారీ చేసింది. దీంతో వేణు స్వామికి నేడు (మంగళవారం) ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వాక్యాలను ఉపసరించుకున్నట్లు తెలిపి ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని హెచ్చరించింది.