• Telugu News
  • /News

Telangana: అసెంబ్లీ లాబీలో.. జర్నలిస్టులపై ఆంక్షలు!

Reported by: sr | వార్త‌లు | Mar 22, 2025, 6:49 pm IST
Read Time: 2 mins
Telangana: అసెంబ్లీ లాబీలో.. జర్నలిస్టులపై ఆంక్షలు!

విధాత: జర్నలిస్టుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధానాలు క్రమంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వార్త సేకరణ విధుల్లో ఉన్న జర్నలిస్టులపై ఆంక్షలు విధిస్తుండటం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ పాస్ లు ఉన్నా కూడా జర్నలిస్ట్ లకు లాబీలోకి నో ఎంట్రీ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

మంత్రుల చాంబర్ల ముందు కూడా మీడియా ఉండవద్దని మౌఖిక అదేశాలు అమలవుతున్నాయి. ప్రతీ మంత్రి ఛాంబర్ ముందు ప్రత్యేకంగా మార్షల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల తరుపున వచ్చిన వారు మంత్రుల చాంచర్ల ముందు నిలుచుంటున్నారని దీంతో వారిని నియంత్రించే క్రమంలో జర్నలిస్టులను కూడా మంత్రుల చాంబర్ల ముందు నిలుచోవద్ధని మౌఖికంగా ఆదేశిస్తున్నారని సమాచారం.