IND vs AUS ODI | వర్షం అంతరాయం – భారత బ్యాటర్లు వైఫల్యం : ‘రోకో’ ఫ్లాప్​ షో

పెర్త్​లో జరుగుతున్న భారత్‌–ఆస్ట్రేలియా తొలి వన్డేలో వర్షం నాలుగోసారి అంతరాయం కలిగించింది. రోహిత్‌, కోహ్లీ, గిల్‌, అయ్యర్‌ తక్కువ స్కోర్లకే ఔట్‌ కావడంతో భారత్‌ 84/5 వద్ద కష్టాల్లో పడింది.

IND vs AUS 1st ODI: Rain Halts Play for 4th Time

IND vs AUS 1st ODI: Rain Halts Play for 4th Time; Kohli, Rohit, Gill, Shreyas Flop as India Struggle at 84/5

(విధాత స్పోర్ట్స్ డెస్క్‌)

పెర్త్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో వర్షం నాలుగోసారి అంతరాయం కలిగించగా, ఆడిన 16.4 ఓవర్లలో భారత్‌ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు దిగిన భారత్​ పరుగుల వేగం మందగించి, బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. మహామహులు రోహిత్​ 8 పరుగులకే అవుట్ కాగా, కింగ్​ కోహ్లీ సున్నాకే ఇంటిముఖం పట్టాడు. ఆ తర్వాత గిల్​, శ్రేయస్​ కూడా వారెనకాలే వెళ్లిపోయారు. ఇకపోతే వర్షం  పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ తొలుత 36 ఓవర్లకు, తర్వాత 32 ఓవర్లకు తగ్గించబడింది. ప్రస్తుత వార్తల వరకు భారత్​ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కెఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్​ సుందర్​ క్రీజ్‌లో ఉన్నారు. మళ్లీ ఓవర్లను 26కు కుదించారు.

విరాట్‌ డక్‌, రోహిత్‌ 8, గిల్‌ 10 — కుప్పకూలిన టాప్‌ ఆర్డర్‌

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలర్లు పెర్త్ పిచ్‌లోని బౌన్స్‌, పేస్‌ను అద్భుతంగా వినియోగించుకున్నారు. జోష్‌ హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్​ భారత టాప్‌ ఆర్డర్‌ను పూర్తిగా చిత్తు చేశారు.

శుభమన్​ గిల్​  నేతృత్వంలోని కొత్త బ్యాటింగ్‌ క్రమం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. రోహిత్‌ శర్మ కేవలం 8 పరుగులు, శుభ్‌మన్‌ గిల్‌ (కొత్త ODI కెప్టెన్‌) 10 పరుగులు, విరాట్‌ కోహ్లీ డక్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 11 పరుగులకే ఔట్‌ అయ్యారు. ఈ నలుగురు ప్రముఖ బ్యాటర్లు కలిసి మొత్తం 39 పరుగులు మాత్రమే చేయడం టీమిండియాకు పెద్ద షాక్‌. హేజిల్‌వుడ్‌ తన వేగంతో రోహిత్‌, అయ్యర్‌లను మోసగించగా, స్టార్క్ విరాట్‌ కోహ్లీని సున్నాకే పంపించాడు. భారత ఇన్నింగ్స్‌ 10 ఓవర్లలో 27/3తోనే గాడితప్పింది.  ఇది గత రెండు సంవత్సరాల్లో భారత్‌కు ODIల్లో అత్యంత చెత్త పవర్‌ప్లే ప్రదర్శన.

వర్షం అంతరాయం – అభిమానుల్లో నిరాశ

పర్థ్‌ మైదానంలో వర్షం నాలుగోసారి ఆటను నిలిపివేసింది. చిన్న చిన్న జల్లులు, నిరంతరంగా పడుతుండడంతో ఆట మళ్లీ మొదలవ్వడంపై అనుమానం నెలకొంది. మొత్తం రెండు గంటలకు పైగా ఆట నిలిచిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ‘రో-కో’ జోడీ (రోహిత్‌, కోహ్లీ) తిరిగి వచ్చి జట్టును నిలబెడతారని అభిమానులు ఆశించగా, వారి అవుట్‌లు మరింత నిరాశ కలిగించాయి. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ రెండో రెయిన్​ బ్రేక్‌ తర్వాత కేవలం 11 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. అక్షర్‌ పటేల్‌, కెఎల్‌ రాహుల్‌ కొంత ధైర్యంగా ఆడుతున్నా, స్కోరు బోర్డుపై ప్రభావం చూపే స్థాయిలో పరుగులు రావడం లేదు.

భారత జట్టు XI:

రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ రెడ్డి (డెబ్యూ), హర్షిత్‌ రాణా, మహ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌.

ఆస్ట్రేలియా XI:

ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), మ్యాథ్యూ షార్ట్‌, జోష్‌ ఫిలిప్పే (wk), మ్యాట్‌ రెన్షా, కూపర్‌ కానెల్లీ, మిచెల్‌ ఓవెన్‌, మిచెల్‌ స్టార్‌క్‌, నాథన్‌ ఎలిస్‌, మాథ్యూ కుహ్నెమాన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌.

పెర్త్ లోని ఈ తొలి వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వర్షం ఆటంకాలు, పిచ్‌ బౌన్స్‌ మరియు హేజిల్‌వుడ్‌ స్పెల్‌ కలయికతో భారత్‌ రన్స్‌ కట్టిపడిపోయాయి.  రాహుల్‌, సుందర్​ భాగస్వామ్యం ద్వారా భారత్‌ కనీసం గౌరవప్రదమైన స్కోరు సాధించగలదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.