Smriti Mandhana | ఈ అంద‌మైన ఉమెన్‌ క్రికెట‌ర్.. అత‌గాడితో ప్రేమ‌లో ఉందా! హాట్ టాపిక్‌గా డేటింగ్

Smriti Mandhana | భార‌త ఉమెన్ క్రికెట‌ర్ స్మ‌తి మంధాన‌కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఆట‌తో పాటు అందానికి కూడా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.అయితే స్మృతికి సంజూ శాంసన్ అంటే భలే ఇష్టం. ఆయ‌న ఆట‌ని చూసేందుకు ఎంతో దూరం వెళ‌తానంటూ ప‌లుమార్లు చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం స్మృతి మంధాన డేటింగ్ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈవిడ‌ బాలీవుడ్ సింగర్ కం డైరెక్టర్‌ ప‌ల‌క్ ముచ్చ‌ల్ త‌మ్ముడు పలాష్‌ […]

  • Publish Date - August 4, 2023 / 02:09 AM IST

Smriti Mandhana |

భార‌త ఉమెన్ క్రికెట‌ర్ స్మ‌తి మంధాన‌కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఆట‌తో పాటు అందానికి కూడా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.అయితే స్మృతికి సంజూ శాంసన్ అంటే భలే ఇష్టం. ఆయ‌న ఆట‌ని చూసేందుకు ఎంతో దూరం వెళ‌తానంటూ ప‌లుమార్లు చెప్పుకొచ్చింది.

ప్ర‌స్తుతం స్మృతి మంధాన డేటింగ్ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈవిడ‌ బాలీవుడ్ సింగర్ కం డైరెక్టర్‌ ప‌ల‌క్ ముచ్చ‌ల్ త‌మ్ముడు పలాష్‌ ముచ్ఛల్ తో ప్రేమ‌లో ఉంద‌నే వార్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. పలాష్ ముచ్ఛల్ త‌ప‌ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోల వ‌ల‌న ఇప్పుడు ఈ విష‌యం దావానంలా వ్యాపించింది.

ప‌లాష్ ముచ్ఛల్ షేర్ చేసిన ఫోటోల్లో అతని చేతిపైన ‘ఎస్‌ఎం’ (స్మృతి మంధాన షార్ట్ కట్లో) అని రాసి ఉండ‌డంతో పాటు స్మృతి మంధాన ఓ ఫొటోలో పలాష్ కి ద‌గ్గ‌ర‌గా ఉండి ఫోటోలకు ఫోజిచ్చింది. ఇవి చూసి వారిద్ద‌రు సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.

ఇప్పుడు స్మృతి మంధాన ది హాండ్రెడ్ లీగ్ కోసం ఇంగ్లాండ్‌లో ఉంది . 2023 హాండ్రెడ్ లీగ్‌లో మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్, మొదటి హాఫ్ సెంచరీ, మొదటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకుంది. ది హాండ్రెడ్ టోర్నీ ముగిసిన తర్వాత ఆమె ఆసియా క్రీడల కోసం చైనా బయలుదేరి వెళ్లనుంది.

బంగ్లాదేశ్ టూర్‌లో కాస్త అతిగా భారత కెప్టెన్ హార్మన్‌ప్రీత కౌర్ వ్వ‌వ‌హ‌రించ‌డంతో ఆమెపై రెండు మ్యాచుల నిషేధం విధించింది ఐసీసీ.. ఈ క్ర‌మంలో ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో భారత మహిళా క్రికెట్ టీమ్‌కి స్మృతి మంధాన, కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది..

అయితే క్వార్టర్ ఫైనల్ గెలిస్తేనే, సెమీస్ చేరే అవ‌కాశం భారత జట్టుకి ఉంది. ఇక సెమీ ఫైనల్‌లోనూ గెలిస్తేనే ఫైనల్ ఆడుతుంది… ఒక‌వేళ సెమీ ఫైనల్‌లో ఓడితే కాంస్య పతకం కోసం పోటీపడాల్సి వ‌స్తుంది. ఏదేమైన ఈ టోర్నీకి ముందు స్మృతి మంధాన డేటింగ్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం కావ‌డం విశేషం.

Latest News