150 అడుగుల ఎత్తులో, కొండ మీద, కొండ కింద వంద ఎకరాల ప్రాంతంలో విస్తరించిన ఫణిగిరి మహా విహారం బౌద్ధ ఆధారాల అక్షయ పాత్రగా అభివర్ణిస్తూ ఉంటారు పురావస్తు అధికారులు
150 అడుగుల ఎత్తులో, కొండ మీద, కొండ కింద వంద ఎకరాల ప్రాంతంలో విస్తరించిన ఫణిగిరి మహా విహారం బౌద్ధ ఆధారాల అక్షయ పాత్రగా అభివర్ణిస్తూ ఉంటారు పురావస్తు అధికారులు
నల్లగొండ : 150 అడుగుల ఎత్తులో, కొండ మీద, కొండ కింద వంద ఎకరాల ప్రాంతంలో విస్తరించిన ఫణిగిరి మహా విహారం బౌద్ధ ఆధారాల అక్షయ పాత్రగా అభివర్ణిస్తూ ఉంటారు పురావస్తు అధికారులు. ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అద్భుతాలు వెలుగుచూస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బౌద్ధ భిక్షువులకోసం నిర్మించిన గదులు, అనేక శాసనాలు, పెద్ద సంఖ్యలో నాణేలు ఫణిగిరి గుట్ట మీద దొరికాయి.
ఈ క్రమంలోనే పురావస్తు శాస్త్రవేత్తలు నల్గొండ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడ్డాయి. జిల్లాలో గల తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధుల కాలంలో వినియోగించినవిగా చెబుతున్న 3700 సీసపు నాణేలను వెలికి తీశారు.
2015లో ఫణిగిరి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో కూడా 2 వేల ఏళ్ల నాటి బౌద్ధ అవశేషాలను, పురావస్తు శాఖ సేకరించింది. ఫణిగిరి క్రీ.పూ. 3 వ శతాబ్దం, క్రీ.శ. 3వ శతాబ్దం మధ్య కాలంలో బౌద్ధ జ్ఞానానికి సంబంధించిన ప్రధాన ప్రాంతంగా వర్ధిల్లినట్లు చెబుతున్నారు. అక్కడి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ద స్తూపం, విహారం, చైత్యాలు వంటివి విస్తరించి ఉన్నాయి. కాగా తెలంగాణలోని అన్ని పురావస్తు స్థలాల కంటే ఎక్కువగా ఇక్ష్వాకుల నాటి శిల్పాలు ఇక్కడ దొరికాయట. ఇక్కడ దొరికిన ప్రతీ రాతి ముక్కా కూడా ఒక అద్భుత కళాఖండమని నిపుణులు చెబున్నారు. 2001-2007లలో, తిరిగి 2018-19లో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 31న నిర్వహించిన తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో నాణేలు, తోరణాలు, శాసనాలు, వ్యాసాలను కనుగొన్నారు.