విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని, డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా నిందితులను విచారించాల్సి ఉన్నందునా.. నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మంగళవారమే వాదనలు ముగిసిపోగా, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Latest News
డ్రగ్స్ కేసులో మలుపు..
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దానకిశోర్
కొత్త బెంజ్ ఈవీ కారు లాంచ్.. సింగిల్ చార్జింగ్తో హైదరాబాద్ నుంచి ముంబై వరకు వెళ్లొచ్చు!
గేమింగ్ లవర్స్కు ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో GT 50 Pro లాంచ్
ఎస్కలేటర్పై ఛేజింగ్లు.. ఫుడ్కోర్టులో ఫైటింగ్లు.. షాపింగ్ మాల్స్లో పబ్జీ గేమ్ ఆడేస్తున్న జెన్జీ!
శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్
తెలంగాణలో తిరిగి ‘టీఆర్ఎస్’ ప్రయోగం.. కవిత ప్రయత్నం ఫలిస్తుందా! వికటిస్తుందా?
తెలంగాణ రోడ్లపై నెత్తుటేర్లు.. రోజుకు 20 మరణాలు
అయ్యా సీఎంగారూ.. ప్రాణాలు పోతున్నాయి... : కాంట్రాక్టర్ల మొర
తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు