బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని రాజాసింగ్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు
మెదక్ అల్లర్ల నేపథ్యంలో ముందస్తు అరెస్టు
విధాత, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని రాజాసింగ్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఇప్పటికే తాను మెదక్ వెళ్లనున్నట్లుగా రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ముంబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. రాజాసింగ్ను పోలీసులు మియాపూర్ అసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లుగా తెలుస్తుంది.
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణలకు దారితీసి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లర్లలో పలు దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామిలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం బీజేపీ వర్గాలు పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.